Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ డే : దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (08:54 IST)
బాబ్రీ మసీదు విధ్వంస రోజైన డిసెంబర్ ఆరో తేదీని దేశంలో బ్లాక్‌ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరం పాతబస్తీలో 150 మంది ఎస్సైలు, 50 సీఐలు, 20 ప్లాటూన్ల బలగాలతో పాటు అదనపు పోలీసులను నియమించారు. దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాలు, చారిత్రక కట్టడాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
బ్లాక్ డే సందర్భంగా నగరంలో చాలా చోట్ల ఆంక్షలు విధించారు పోలీసులు. దేశంలోని ప్రధాన నగరాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు తనిఖీలు చేపట్టారు. మతఘర్షణలు సృష్టించే శక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించారు పోలీసులు.
 
పాతబస్తీలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు… ఆయా ఏరియాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం నగరంలో ఉన్న 3500 మంది పోలీసు బలగాలతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ లను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments