Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద పుష్కర్ మృతి కేసు: కొత్త ప్యానెల్ ఎంపిక.. క్షుణ్ణంగా దర్యాప్తు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (16:00 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్యానల్‌‌ను నియమించింది. చండీగఢ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు, పుదుచ్చేరి వైద్యులొకరు, ఢిల్లీలో లేడి హర్డింజ్ మెడికల్ కాలేజీ డాక్టర్ ఒకరు ఉన్నట్లు తెలిసింది.
 
ఈ కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాలను విశ్లేషించేందుకు కొత్తగా ఈ నలుగురితో కూడిన ప్యానెల్ పనిచేస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్‌కు ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ ప్యానెల్ నియామకం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన వైద్య నివేదికను కూడా పూర్తిగా పరిశీలిస్తారు. దర్యాప్తు సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరిస్తారు. 
 
ముఖ్యంగా ఏఐఐఎంఎస్ వైద్యులు కూడా సునంద పుష్కర్ మృతికి కారణాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ కేసులో వివిధ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల్లో వైరుద్ధ్యాలున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments