Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై.. విమానాశ్రయాల్లో మూత్రం నిల్వ? ఐడియా ఇచ్చిన కేంద్ర మంత్రి

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (13:17 IST)
ఇకపై విమానాశ్రయాల్లో మూత్రం నిల్వ చేయనున్నారు. ఈ ఐడియా ఇచ్చింది సాక్షాత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అయితే, ఆయన ఆలోచన వెనుక భారీ ప్రణాళికే ఉంది. అదేంటంటే.. మనుషుల మూత్రం నుంచి యూరియా తయారు చేయవచ్చన్నది ఆయన ఆలోచన. 
 
నాగపూర్‌లో జరిగిన మేయర్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. మూత్ర నుంచి యూరియా తయారు చేయాలని సూచించడం విశేషం. ఈ పని చేస్తే అసలు ఇండియా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే రాదన్నారు. 
 
సహజ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా తయారు చేయొచ్చో గడ్కరీ వివరించారు. మనుషుల మూత్రంతోనూ జీవ ఇంధనం తయారు చేయవచ్చని చెప్పారు. మనిషి మూత్రంలో అమోనియం సల్ఫేట్, నైట్రోజన్‌లను వెలికి తీయొచ్చన్నారు. అందుకే ఎయిర్‌పోర్ట్‌లలో మూత్రాన్ని నిల్వ చేయమని సూచన చేసినట్టు చెప్పారు. 
 
మనం యూరియాను దిగుమతి చేసుకుంటాం. కానీ దేశంలోని అందరి మూత్రాన్ని మనం స్టోర్ చేసి పెడితే.. అసలు మనకు యూరియా దిగుమతి అవసరమే రాదు. అంతేకాదు ఏదీ వృథా కాదు అని గడర్కీ అన్నారు. నా ఆలోచనలన్నీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టే.. ఎవరూ నాకు సహకరించరు అని ఆయన చెప్పడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments