Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న.. ఎందుకంటే?

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (09:49 IST)
హర్యానాలోని ఫరీదాబాద్‌లో గొడవ కారణంగా ఒక వ్యక్తి తన తమ్ముడిని కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. వివరాల్లోకి వెళితే...   మృతుడైన తమ్ముడిని విష్ణు (20)గా గుర్తించారు. అతని నిందితుడు సోదరుడు సోను నేరం చేసిన తరువాత పరారీలో ఉన్నాడు.
 
తన కుమారులు ఇద్దరూ మద్యం సేవించారని, ఏదో సమస్యపై వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని మృతుడి తల్లి తెలిపింది. తాను వాదనను ఆపడానికి ప్రయత్నించానని, అయితే సోదరులిద్దరూ ఘర్షణకు దిగారని ఆమె తెలిపింది. ఆ తర్వాత జరిగిన గందరగోళంలో నిందితుడు తన తమ్ముడిని తల్లి ముందు పొడిచి పారిపోయాడు.
 
బాద్ షా ఖాన్ సివిల్ హాస్పిటల్ నుంచి ఈ సంఘటన గురించి తనకు సమాచారం అందిందని ఏసీపీ సాత్పాల్ యాదవ్ తెలిపారు. దర్యాప్తులో, పెద్ద వాడు తన తమ్ముడిని కత్తితో పొడిచడానికి ముందు ఇద్దరు సోదరులు కత్తులతో ఒకరితో ఒకరు ఘర్షణ దిగారని వెల్లడైనట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం మృతుల బంధువులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఏసీపీ తెలిపారు. "ఫిర్యాదు అందుకున్న తర్వాతే నిందితులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాద్ షా ఖాన్ సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు' అని ఏసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments