Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా ఎన్నికల తేదీల్లో మార్పు.. ఎందుకని?

ఠాగూర్
ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (10:06 IST)
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కి వాయిదా వేసింది. శతాబ్దాల నాటి బిష్ణోయ్ కమ్యూనిటీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పుడు అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒక రాష్ట్ర ఫలితాలు ఇతర రాష్ట్రాల ట్రెండ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మూడో, చివరి దశతో పాటు హర్యానా ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. 
 
తమ గురు జంభేశ్వర్‌ను స్మరించుకుంటూ 300-400 ఏళ్ల నాటి ఆచారాన్ని కొనసాగిస్తున్న బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలను గౌరవించేందుకు హర్యానా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
 
కాగా, హర్యానా ప్రజలు తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమావాస్య పండగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో తేదీలు మార్చినట్లు ఈసీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments