Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (09:38 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు కామాంధులు కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం జరిపారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం..
 
విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. ఈ క్రమంలో స్కార్పియో కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి నడుస్తున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బల్లభ్‌గఢ్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.  
 
తర్వాత ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న ఆమె తన ఫోన్‌ను స్విచాన్ చేసి సోదరుడికి సమాచారం అందించింది. అంతకంటే ముందే ఆమెను గమనించిన కొందరు వాహనదారులు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఆమె గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments