Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం

Webdunia
గురువారం, 14 జులై 2022 (11:01 IST)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారతీయ దంపతులను సోదా చేయగా, వారి నుంచి ఏకంగా 45 పిస్టల్స్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ దంపతులను జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్‌గా గుర్తించారు. 
 
పైగా, ఈ కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ విచారిస్తుంది. ఎన్.ఎస్.జీ అధికారులు పరిశీలించి ఈ తుపాకులు నిజమైనవేనని తేల్చింది. అదేసమయంలో ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలోనే ఉన్నాయని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకీల విలువ రూ.22.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు, అరెస్టు చేసిన దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. వీరివద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీతి సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ వద్ద జరిపిన విచారణలో వెల్లడించారు. 
 
ఈ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి వియత్నాంకు తెచ్చి తమకు ఇచ్చారని, వాటిని తాము ఢిల్లీకి తీసుకొచ్చినట్టు చెప్పారు. పైగా, గతంలో తామిద్దరం టర్కీ నుంచి 25 పిస్టళ్లను కూడా తెచ్చినట్టు ఈ దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments