Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ దంపతుల వద్ద 45 పిస్టల్స్ స్వాధీనం

Webdunia
గురువారం, 14 జులై 2022 (11:01 IST)
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారతీయ దంపతులను సోదా చేయగా, వారి నుంచి ఏకంగా 45 పిస్టల్స్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ దంపతులను జగ్జీత్ సింగ్, జస్వీందర్ కౌర్‌గా గుర్తించారు. 
 
పైగా, ఈ కేసును నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ విచారిస్తుంది. ఎన్.ఎస్.జీ అధికారులు పరిశీలించి ఈ తుపాకులు నిజమైనవేనని తేల్చింది. అదేసమయంలో ఈ తుపాకులు పూర్తిగా పనిచేసే స్థితిలోనే ఉన్నాయని ఓ కస్టమ్స్ అధికారి తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న తుపాకీల విలువ రూ.22.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
మరోవైపు, అరెస్టు చేసిన దంపతులు వియత్నాంలోని హోచిమిన్ సిటీ నుంచి ఢిల్లీకి వచ్చారు. వీరివద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఈ తుపాకులను గుర్తించారు. వాటిని తన సోదరుడు మంజీతి సింగ్ ఇచ్చినట్టు జగ్జీత్ వద్ద జరిపిన విచారణలో వెల్లడించారు. 
 
ఈ పిస్టళ్లను మంజీత్ సింగ్ ఫ్రాన్స్‌లోని పారిస్ నుంచి వియత్నాంకు తెచ్చి తమకు ఇచ్చారని, వాటిని తాము ఢిల్లీకి తీసుకొచ్చినట్టు చెప్పారు. పైగా, గతంలో తామిద్దరం టర్కీ నుంచి 25 పిస్టళ్లను కూడా తెచ్చినట్టు ఈ దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments