పంజాబ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనను రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముగిసిన తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా సభలో ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు.
గురుదాస్ పూర్ ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ ప్రకటన చేయాలంటూ లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెంకయ్య స్పందిస్తూ ఈ అంశంపై చర్చకు కూడా సిద్ధమని స్పష్టంచేశారు. దేశభద్రతకు సంబంధించిన అంశంపై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు.