Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగరాజును కంటిచూపుతోనే తరిమికొట్టిన అక్కాచెల్లెళ్లు.. ఎక్కడో తెలుసా?

ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సింహాన్నే కంటిచూపుతో పారిపోయేలా చేశారు. ఆడపిల్లలైనా.. సింహాన్ని చూసి జడుసుకోక ధైర్యంగా ఎదురు తిరిగారు. అందుకని కత్తులుకటార్లతో దాడికి దిగలేదు. చూపుతోనే మృగరాజును తరిమికొట్టారు

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:19 IST)
ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు సింహాన్నే కంటిచూపుతో పారిపోయేలా చేశారు. ఆడపిల్లలైనా.. సింహాన్ని చూసి జడుసుకోక ధైర్యంగా ఎదురు తిరిగారు. అందుకని కత్తులుకటార్లతో దాడికి దిగలేదు. చూపుతోనే మృగరాజును తరిమికొట్టారు. ఎలాగంటే..? సంతోక్ (19), మయ్యా (18) ఇద్దరూ అక్కా చెల్లెళ్లు. గుజరాత్‌లోని గిర్ అభయారణ్యం సమీపంలోని కుగ్రామం వీరి నివాసం. తండ్రికి అనారోగ్యం కావడంతో పశువులను మేపేందుకు కొన్ని రోజులుగా వీరు అడవిలోకి వెళ్తున్నారు. 
 
అక్టోబర్ 9న ఎప్పటిలాగే.. పశువులను మేపడానికి వెళ్లినప్పుడు అక్కడికి ఒక సింహం వచ్చింది. ఆసియాటిక్ సింహాలు క్రూరమైనవి. సింహాన్ని చూసిన వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిలు పారిపోలేదు. తమతో పాటు పశువుల ప్రాణాలు కూడా కాపాడాలని నిశ్చయించుకున్నారు. చేతిలో మామూలు కర్రలతో ధైర్యంగా పశువుల ముందుకు వెళ్లి.. సింహం వైపే చూస్తూ నిలబడిపోయారు. 
 
సింహాన్ని రెచ్చగొట్టకుండా.. దాని కంటే తీవ్రమైన చూపులతో భయపెట్టారు. వారిని చూసి సింహం ఏమనుకుందో ఏమో కానీ.. వెనక్కు తిరిగి వెళ్లిపోయింది. బాలికల ధైర్యం చూసిన గ్రామస్తులు, అటవీ అధికారులు అక్కాచెల్లెళ్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సింహానికి వెన్నుచూపితేనే దాడి చేస్తాయని.. వాటికి ముందు ధైర్యంగా నిలబడితే పారిపోతాయని సంతోక్ చెప్పడం.. అందరినీ షాక్‌కు గురిచేసింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments