Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను నా శవాన్ని తాకనీయొద్దు... వైద్యురాలి సూసైడ్ నోట్

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:42 IST)
గుజరాత్‌ రాష్ట్రంలో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడే ముందు సూసైడ్ లేఖ రాసిపెట్టింది. తన మృతదేహాన్ని తన భర్తతో తాకనివ్వొద్దని ఆమె కోరింది. దీంతో ఆత్మహత్య కేసులో భర్త హస్తముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్‌లో అడాజన్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని శివకుటీర్ అపార్ట్‌మెంట్‌లోడాక్టర్ మాలిని(29)కి ఆరేళ్ల క్రితం డాక్టర్ చింతిత్ పటేల్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత మాలిని భర్తతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు వేధించసాగారు. ఈ నేపథ్యంలో మాలిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయే ముందు రాసిన లేఖలో... తన చావుకు అత్తింటి వారి వేధింపులే కారణమని పేర్కొంది. 
 
అయితే, తన మృతదేహాన్ని భర్తను తాకనీయవద్దని కోరింది. దీంతో మాలిని మృతదేహానికి ఆమె పుట్టింటివారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మాలిని ఫోనును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments