Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైయింగ్ : పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాను అరెస్టు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:39 IST)
గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌లో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సాజిద్‌ అనే వ్యక్తి పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. 
 
ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్‌ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్‌ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్‌ గుర్తించింది. 
 
2011, 2012 సంవత్సరాలలో సాజిద్‌ 46 రోజుల పాటు పాక్‌లో గడిపినట్టు అతని పాస్‌పోర్టు ద్వారా బయటపడింది. బీఎస్‌ఎఫ్‌లో నమోదైన సాజిద్‌ పుట్టిన రోజు కూడా తప్పేనని తేలింది. ఈ ఆధారాలు సేకరించిన ఏటీఎస్‌ పోలీసులు.. భుజ్‌లోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి రెండు ఫోన్లు, ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్న సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments