Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు ఎక్కేందుకు నిరాకరించిన దళిత యువతిని చంపేశారు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (11:15 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. బైకు ఎక్కేందుకు నిరాకరించిన ఓ దళిత యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా బావ్లా పట్టణంలో మరో రెండు వారాల్లో బాధిత యువతి మిట్టల్ జాదవ్ వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో తన స్నేహితులైన శ్రవణ్, ధన్‌రాజ్‌లతో కలిసి వచ్చిన కేతన్ వాఘేలా అనే యువకుడు యువతిని తన బైక్‌పై ఎక్కాల్సిందిగా కోరాడు. 
 
మిట్టల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేతన్ అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం కత్తి పట్టుకునే అక్కడి నుంచి పరుగులు తీశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతి కాసేపటికే ప్రాణాలు విడిచింది. 
 
యువతి తండ్రి రమేశ్ జాదవ్ ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments