Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు భోజనం ఆరగించి 1200 మంది అస్వస్థత

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (09:56 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ పెళ్లి విందులో అపశృతి చోటుచేసుకుంది. దీంతో 1200 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరంతా పెళ్లి విందు భోజనాన్ని ఆరగించిన తర్వాత అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోహసనా జిల్లాలో జరిగింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం తగ్గి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో విందులు, వినోదాలు, శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత తన కుమారుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. 
 
ఈ పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చారు. ఈ పెళ్లితంతు ముగిసిన తర్వాత పెళ్లి విందు భోజనం ఆరగించారు. అయితే, ఈ భోజనం కలుషితమై ఉండటంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. 
 
ఈ ఆహారం ఆరగించిన చాలా మందికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. విందులో ఏర్పాటు చేసిన ఆహార నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 
 
మరోవైపు, ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. విందులో అతిథులు వడ్డించిన ఆహార పదార్థాల్లో మాంసాహారం కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ విందులో ఉపయోగించిన మాంసం నిల్వ చేయడం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాలా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments