Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక కట్నం డిమాండ్ చేసిన వరుడు.. చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (12:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కట్నం మరింతగా ఎక్కువగా అడిగిన వరుడిని వధువు కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి అవమానించారు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. 
 
ఈ జిల్లాలో పెద్దలు కుదిర్చిన వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ "జై మాల" వేడుకలో వరడుు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు వధువు కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన వరుడు.. దీనికి మరింతగా ఆజ్యం పోస్తూ వధువు కుటుంబం నుంచి కట్నాన్ని మరింతగా డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. 
 
ఈ వ్యవహారంపై పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వధువు తరపు బంధువులు వరుడిని చెట్టుకు తాళ్లతో కట్టేశారు. దీనిపై వరుడు తరపు బంధువులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు చేరుకుని తాళ్ళతో చెట్టుకు కట్టేసిన వరుడిని విడిపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇరు కుటుంబాల మధ్య విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments