Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అని పెళ్లి ఆగిపోయింది.. వధువు తల నరికిన వరుడు

సెల్వి
శనివారం, 11 మే 2024 (12:31 IST)
పెళ్లి లేటవుతుందని.. ఓ వరుడు వధువును పొట్టనబెట్టుకున్నాడు. నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయి మైనర్ కావడంతో రంగంలోకి దిగిన అధికారులు అడ్డుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన వరుడు ఆమెను నరికి చంపాడు. 
 
కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. వివరాల్లోకి వెళితే.. కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (16)తో స్థానికుడైన ప్రకాశ్ (32)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయించారు. 
 
గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇంకా మైనర్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. బాల్య వివాహం నేరమని ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
 
నిశ్చితార్థం అడ్డుకోవాలని మీనానే అధికారులకు సమాచారం ఇచ్చిందని అనుమానించిన ప్రకాశ్.. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆపై మీనాను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి తల నరికి హత్య చేశాడు. మొండాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments