Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో పచ్చి మిర్చి ఘాటు: కేజీ రూ.120 అట!

Webdunia
శనివారం, 2 ఆగస్టు 2014 (13:48 IST)
టమోటాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మిర్చి ఘాటు కూడా పెరిగిపోతోంది. ముంబయిలో పచ్చిమిరపకాయలు కేజీ రూ.120 పలుకుతున్నాయట. మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతం మిర్చి పంటకు ప్రసిద్ధి. అయితే, వర్షాభావం కారణంగా పంట ఆశించిన స్థాయిలో లేదు.

దీంతో, అక్కడి నుంచి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగిపోయాయి. కొంతకాలం నుంచి ముంబయి మార్కెట్ వర్గాలు కర్ణాటకలోని హవేరి ప్రాంతం నుంచి మిర్చిని దిగుమతి చేసుకుంటుండగా, అక్కడ భారీవర్షాల కారణంగా రైతులు ఈ పంటకు దూరంగా ఉన్నారు. 
 
తాజాగా, అక్కడి నుంచి 14 ట్రక్కులు మాత్రమే మిర్చి లోడుతో ముంబయికి చేరుకున్నాయి. కానీ, నగర వాసుల అవసరాల దృష్ట్యా 30 ట్రక్కుల మిర్చి అయితేగానీ సరిపోదట. దీనికితోడు ఎడతెగని వర్షాలతో సరుకు దెబ్బతినడం కూడా మిర్చి ధరల పెంపునకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments