Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు క్యాన్సర్.. వేరొక మహిళతో సంబంధాలు.. సొంత ఇంటికే కన్నం వేశాడు..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:17 IST)
భార్య క్యాన్సర్‌తో బాధపడుతుందని తెలియగానే వేధింపులు మొదలెట్టాడు. అతని వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా కొన్నాళ్లు జైలులో గడిపారు. అంతే జైలు నుంచి విడుదలయ్యాక కక్ష్య పెంచుకున్న అతడు సొంత ఇంటికి కన్నం వేశాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 47 ఏళ్ల మహిళకు 25 ఏళ్ల క్రితం సురేంద్ర సింగ్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. సురేంద్ర ఓ ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే భార్యకు క్యాన్సర్ అని తెలియరావడంతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. అతడి వేధింపులు తాళలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా జైలుకెళ్లిన అతడు తిరిగి రావడంతో.. భార్య వుంటున్న సొంత ఇంటికే కన్నం వేశాడు. 
 
సురేంద్ర తన సోదరుడు శైలేంద్ర, స్నేహితుడు నితిన్‌తో కలిసి.. సొంతింట్లోని బంగారాన్ని కాజేశాడు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు క్యాన్సర్ వుందని తెలిశాక, సురేంద్ర వేరొక మహిళలతో గడుపుతున్నాడని.. ఆమెను పెళ్లాడేందుకే తన బంగారాన్ని కాజేశాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న సురేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments