Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు కేశవ్ ఇకలేరు

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:20 IST)
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు కన్నుమూశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమార్తె దేశిరాజు శకుంతల కుమారుడే కేశవ్ కావడం గమనార్హం. 
 
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న కేశవ్ సివిల్స్‌లో సత్తాచాటి ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. కేంద్ర ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత చెన్నై రాయపేటలో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై ఆయన రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఈయన తండ్రి నరసింహా రావు సైన్యంలో మేజర్‌గా సేవలందించారు. కేశవ్ మృతికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments