Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమోసాలు తీసిస్తానని తాత, మేనమామ బాలికపై గ్యాంగ్ రేప్.. రూ.20లను ఇచ్చి..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:34 IST)
మహిళలపై వయోబేధం లేకుండా, వావి వరుసలు లేకుండా లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తగ్గట్లేదు. తాజాగా ఆరేళ్ల బాలికపై ఆమె తాతయ్య, మేనమామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. 
 
బాలిక సోదరుడి ముందే వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది రోజుల కిందట జరిగిన ఈ ఘోరం గురువారం సాయంత్రం వెల్లడైంది. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లి ప్రశ్నించడంతో జరిగిన విషయం బాధితురాలు వివరించింది.
 
ఆపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై కేసు నమోదైంది. కొద్దిరోజుల కిందట తన మేనమామ సమోసాలు ఇస్తానని తనను, తన సోదరుడిని బంధువుల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ అప్పటికే తాత ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
వారు సోదరుడి ఎదుటే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. నిందితులు బాలికకు రూ.20 ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని కోరారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం