Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన యువకుడు.. తాత అమ్మమ్మలను చంపేశాడు..

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (12:51 IST)
కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ రాష్ట్రంలోని త్రిశూర్ పిచ్చాసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఓ యువకుడు తాత, అమ్మమ్మలను చంపేశాడు. అక్కడ నుంచి కర్నాటక రాష్ట్రానికి పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
త్రిశూర్‌కు చెందిన అక్మల్ అనే యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఓ మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకొని ఆదివారమే ఇంటికి వచ్చాడు. 
 
అతడి తల్లి రెండో పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తాత, అమ్మమ్మల వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున వృద్ధులైన అబ్దుల్లా (75), జమీలా(64) హత్య చేసి ఇంటి నుంచి పరారయ్యాడు.
 
 
 
బంధువు ఒకరు కిరాణా సామాన్లను ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా.. వృద్ధులిద్దరూ విగతజీవులై పడివుండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
దీంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు అక్మల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకలోని ఉన్నాడని తెలుసుకొని అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. మంగుళూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments