డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన ప్రభుత్వ ఉద్యోగి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (09:54 IST)
ఇటీవలికాలంలో హఠాత్తుగా గుండెపోటుకుగురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి ఘటనలు వరుసగా సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసే సురేంద్ర కుమార్ దీక్షిత్ అనే వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన స్నేహితులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన చుట్టూ ఉన్న మిగిలిన వారంతా ఆయన్ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
భోపాల్‌లో తపాల శాఖ ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు 34వ ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ 17వ తేదీన జరిగింది. మార్చి 16వ తేదీన కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో సురేంద్ర కుమార్ ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments