Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ అస్తమయం : రెండు రోజులపాటు సంతాప దినాలు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (12:31 IST)
భారత సినీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అస్తమించారు. ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. 
 
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ముంబైలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. లతా మంగేష్కర్ నవల కరోనా వైరస్ సోకడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసియులో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందే సమయంలో తిరిగి న్యుమోనియా బారినపడ్డారు. దీంతో ఆమె తిరిగి కోలుకోలేక అస్తమించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సంతాప దినాలను ప్రకటించారు. ఆమెకు గౌరవ సూచకంగా ఈ రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అవనతం (జాతీయ జెండాను సగం ఎత్తులోనే పతాకం ఎగురవేసి ఉంచడం) చేస్తారు అని ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసంలో ఉంచుతారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో డాన్ బోస్కో చిత్రీకరణ ప్రారంభం

మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

వివాహం వ్యర్థం.. నన్ను అడిగితే పెళ్లి చేసుకోవద్దనే చెప్తాను.. థమన్ కామెంట్స్

సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన మూవీ తెలుసు కదా నుండి రొమాంటిక్ పోస్టర్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments