Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ అస్తమయం : రెండు రోజులపాటు సంతాప దినాలు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (12:31 IST)
భారత సినీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అస్తమించారు. ఆమె ఆదివారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అంతేకాకుండా ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వం రెండు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. 
 
నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ముంబైలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. లతా మంగేష్కర్ నవల కరోనా వైరస్ సోకడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఐసియులో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందే సమయంలో తిరిగి న్యుమోనియా బారినపడ్డారు. దీంతో ఆమె తిరిగి కోలుకోలేక అస్తమించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సంతాప దినాలను ప్రకటించారు. ఆమెకు గౌరవ సూచకంగా ఈ రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అవనతం (జాతీయ జెండాను సగం ఎత్తులోనే పతాకం ఎగురవేసి ఉంచడం) చేస్తారు అని ప్రభుత్వం తెలిపింది. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసంలో ఉంచుతారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments