గుడ్ న్యూస్.. గూడూరు-రేణిగుంట మూడో రైలు మార్గం

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (19:29 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్పీజీ) 72వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని గూడూరు-రేణిగుంట మూడో రైలు మార్గంలో ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో 83.17 కి.మీ. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 884 కోట్లుగా నిర్ణయించబడింది. ఇది ప్రయాణీకుల, కార్గో కదలిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రాజెక్టుకు 36.58 హెక్టార్ల భూమి అవసరం.
 
ప్రాజెక్ట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల నవీకరణలో కొత్త వంతెనలు, విస్తరించిన అండర్‌పాస్‌లు, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలోకి రావడంతో, ప్రాజెక్టును త్వరితగతిన గ్రౌండింగ్ చేయడానికి అవసరమైన భూసేకరణ, ఇతర వనరులను వేగంగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. 
 
అలాగే మహారాష్ట్రలోని పూణే మెట్రో లైన్ ఎక్స్‌టెన్షన్, జమ్మూ-కాశ్మీర్‌లోని జాతీయ రహదారి ఇతర రెండు ప్రాజెక్టులలో ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు దేశ నిర్మాణంలో, వివిధ రవాణా మార్గాలను ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఆయా ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments