Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, నవంబరు 16 నుంచి మండల యాత్ర ప్రారంభం

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (16:05 IST)
కరోనావైరస్ కారణంగా అన్ని రాష్ట్రాలలో గల దేవాలయాలు మూతబడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వెళ్లే శబరిమల యాత్ర బ్రేకులు పడతాయని భావించారు. అయితే కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం యాత్రకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు 16 నుంచి మండల యాత్ర ప్రారంభిస్తామని ప్రకటించింది.
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా అనుమతి ఇస్తున్నట్లు ట్రావెన్‌కోర్ ట్రస్ట్ అధికారులు, కేరళ ప్రభుత్వం సంయుక్తంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సోమవారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు రెండు నెలల పాటు శబరి గిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగనున్నాయి. 
 
వర్చువల్ క్యూ విధానం ద్వారా పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్న వారికి మాత్రమే ఆలయం లోనికి అనుమతి ఉంటుందని తెలిపారు. పంబా నదిలో స్నానానికి అనుమతి లేదని తెలిపారు. దర్శనం తర్వాత వెంటనే భక్తులు వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలనుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments