Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చిన రాధే మా... ఫోటో వైరల్

దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ పీఎస్‌ను సందర్శించింది. దీనితో అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ స్వాగతం పలి

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:51 IST)
దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ పీఎస్‌ను సందర్శించింది. దీనితో అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ స్వాగతం పలికారు. ఏకంగా ఆమె అధికారి కుర్చీలో కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిలుచుని ఉండడం.. దండం పెడుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. 
 
దైవాంశసంభూతురాలిగా చెప్పుకొనే 'రాధా' అధికారి కుర్చీలో కూర్చొవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను డిస్ట్రిక్ లైన్స్‌కు పంపించినట్లు, సీపీ ఈస్ట్రన్ రేంజ్‌కు జాయింట్ చేసినట్లు సమాచారం. 
 
నిజానికి రాధేమాకు ఎక్కడకు వెళ్లినా దండాలు.. ఘన స్వాగతాలు పలుకుతుంటారు. ఆమె భక్తులంతా సంపన్న వర్గాలకు చెందిన భక్తులే. ఈమెను అనుసరించే వారిలో ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండే రాధేమా గతంలో అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకోగా, ఇపుడు మరో వివాదంలో చిక్కుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments