చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

ఠాగూర్
మంగళవారం, 9 డిశెంబరు 2025 (18:40 IST)
ఆహారం కోసం జనావాసాల్లోకి చిరుత పులులు ప్రవేసించి, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఈ తరహా దాడులను అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలాలని మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ అన్నారు. ఇటీవలికాలంలో మహారాష్ట్రలో చిరుత పులులదాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ ఓ ఐడియా ఇచ్చారు.
 
చిరుత పులులు జనవాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే భారీ సంఖ్యలో మేకలను అడవుల్లోకి వదిలిపెట్టాలని ఆయన సూచించారు. చిరుత పులుల దాడుల్లో బాధితులు చనిపోయిన తర్వాత పరిహారం ఇవ్వడం కంటే.. ఆ డబ్బుతోనే మేకలను కొనుగోలు చేసి అడవిలోకి వదిలివేయాలని కోరారు. ఈ మేరకు ఆయన అధికారులకు సూచించారు. 
 
ఒక వేళ చిరుత పులుల దాడిలో నలుగురు మరణిస్తే పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను చెల్లించాలి. అందుకే మరణాల తర్వాత పరిహారం అందించే బదులు, ఆ రూ.కోటి విలువైన మేకలను అడవుల్లోకి వదిలితో చిరుతలు జనవాసాల్లోకి రాకుండా ఉంటాయి అని వ్యాఖ్యానించారు.
 
చిరుతల ప్రవర్తన, వాటి జీవిన విధానాలు మారిపోయాయన్నారు. ఒకపుడు అడవి జంతువులుగా పేర్కొన్నప్పటికీ ఇపుడు వాటి ఆవాసం చెరకు తోటలకు మారిపోయిందన్నారు. అహల్యానగర్, పూమె, నాసిక్ జిల్లాల్లో చిరుత దాడులు ఇటీవల భారీగా పెరిగాయని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha-Raj: సమంత, రాజ్ నిడిమోరు ఫ్యామిలీ ఫోటో వైరల్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments