Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీస్ బాయ్ కాల్పులు... ఇంటర్ విద్యార్థిని మృతి..!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:57 IST)
బెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ప్రగతి రెసిడెన్షియల్ కాలేజీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న మహేశ్ బుధవారం ఉదయం తుపాకీ చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇంటర్ విద్యార్థిని గౌతమి(18) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆమె స్నేహితురాలు శిరీష తీవ్రంగా గాయపడింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కళాశాలకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన వెంటనే మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఈ ఘటన వెనుక ప్రేమ వ్వవహారమే కారణమని తెలుస్తోంది. తన ప్రేమను తిరస్కరించిన కారణంగానే మహేశ్, గౌతిమిపై కాల్పులు జరిపాడని సమాచారం. 
 
కాల్పుల సమాచారంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు. కాల్పుల ఘటనతో కళాశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments