Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ విధించినా.. ఆగని అత్యాచారాలు.. కాటేస్తున్న కామాంధులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:49 IST)
కరోనా మహమ్మారి లాంటి వ్యాధులు భయపెడుతున్నా.. దేశంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. లాక్ డౌన్ విధించినా.. పోలీసుల భద్రత పటిష్టంగా వున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. గుంటూరులో చిన్నారిపై అత్యాచారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన మరియానందం (48) అత్యాచారానికి ఒడిగట్టాడు. 
 
బాలిక తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లు, కొడుకుని పోషిస్తోంది. గురువారం(ఏప్రిల్ 23,2020) మధ్యాహ్నం బాలిక ఇంట్లో వారంతా మిర్చి కోతలకు వెళ్లారు. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఇదే అదనుగా మరియానందం బాలికను బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
మధ్యాహ్నం పనులకు వెళ్లి వచ్చిన తల్లికి బాలిక విషయాన్ని తెలిపింది. తల్లి ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరియానందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments