Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన కోర్కెకు లొంగలేదని యువతిని గొడ్డలితో నరికి చంపిన మృగాడు!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ ఏరియాలో ఈ దారుణం జరిగింది. తన కోర్కె తీర్చుకునేందుకు ఓ యువతిని చెరబట్టాడు. ఆమె ఎంతకీ లొంగక పోగా ఎదురుతిరిగింది. దీన్ని జీర్ణించుకోలేని ఆ కామాంధుడు ఆ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ధోల్‌పూర్ సమీపంలోని బసేది ప్రాంతానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన అదే ప్రాంతానికి చెందిన విష్ణు ఠాకూర్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక అతడిని అడ్డుకుని, చుట్టుపక్కల వారికి వినిపించేలా కేకలు వేసింది. 
 
దీంతో సదరు వ్యక్తి పక్కనే ఉన్న గొడ్డలితో బాలికపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. బాలిక కేకలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. కాళ్లు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామాకు తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments