Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ మహిళలకు గిఫ్ట్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (16:17 IST)
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ వాసులకు దగ్గరయ్యేందుకు పలు ప్రకటనలు చేస్తున్న సీఎం… తాజాగా బస్సుల్లో భద్రతపై దృష్టిసారించారు.

సుమారు 13వేల మంది మార్షల్స్ ను నియమించారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
 
గతంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించిన సీఎం… దీనిని అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. దివాళీ గిఫ్టుగా మహిళలు ఇక నుంచి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.

మంగళవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంతకుముందు మెట్రో రైళ్లలో కూడా మహిళలు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అయితే సుప్రీంకోర్టు తప్పబట్టడంతో అమలు చేయలేకపోయారు. ఎన్నికల నేపథ్యంలోనే ఉచిత ప్రయాణం, మార్షల్స్ నియామకం చేపట్టినట్టు రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments