Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికే యాభై సార్లు చెప్పా.. మోడీనే ప్రధాని : నితిన్ గడ్కరీ

Webdunia
మంగళవారం, 21 మే 2019 (10:16 IST)
ఈ నెల 23వ తేదీ తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ వస్తుందని, ఆ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు.
 
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోడీ చిత్ర పోస్టర్‌ను ఆయన ముంబైలో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే తుది ఫలితాలు కాదన్నరు. అయితే, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే సంకేతాలను మాత్రం ఇచ్చాయని ఆయన గుర్తుచేశారు. 
 
ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ కాదని, ఎగ్జిట్ పోల్స్‌లో ఉన్నది తుది ఫలితాల్లో ప్రతిబింభిస్తుందన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము ఎన్నికలకు వెళ్లామని ఇప్పటికే 20 నుంచి 50 సార్లు చెప్పానని గడ్కరీ అన్నారు. మోడీనే మరోసారి ప్రధాని అవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments