Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎం.నవరాణే నియామకం

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:21 IST)
భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరాణే నియమితులయ్యారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో కొనసాగుతారు. 
 
ఈ నెల 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత మహాదళపతి బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14 చనిపోయారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేంతవరకు పాత పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నవరాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నవరాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహించేవారు. కొత్త సీడీఎస్ పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో ఉంటారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments