Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల చిన్నారిపై ఆలయంలో పూజారుల అత్యాచారం.. మిఠాయి ఇచ్చినా.. నొప్పితో?

దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నారులు రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతో

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:21 IST)
దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చిన్నారులు రోడ్డుపై కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ చిన్నారిపై కన్నేసిన ఇద్దరు నీచ పూజారులు ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.


మిఠాయిల ఆశచూపి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మిఠాయిలు ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే బాలిక నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో ఓ బాలిక(5)పై ఊరిలోని గుడి పూజారులు రాజు పండిత్(55), బతోలీ ప్రజాపతి(45) కన్నేశారు. మిఠాయిలు కొనిస్తామని ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లారు.

అనంతరం అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు ఏడుస్తూ ఉండటంతో మిఠాయిలు కొనిచ్చి ఇంటి వద్ద దించారు. కానీ బాలిక నొప్పితో విలవిల్లాడుతూ ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది. దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.  12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించే చట్టాన్ని గతేడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఈ కామాంధులకు మరణశిక్ష తప్పదని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments