Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు

Webdunia
సోమవారం, 4 మే 2020 (20:01 IST)
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో విదేశీ రాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉపాధి కోసం, ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్న భారతీయులకు కేంద్రం తాజాగా శుభవార్త చెప్పింది.
 
మే 7 నుంచి విదేశాల నుంచి వచ్చే భారతీయుల కోసం విమానాలు, నౌకలు నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల జాబితాను భారతీయ ఎంబసీలు, హై కమిషన్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

అయితే.. ఈ విమానాలు, నౌకల్లో రావాలనుకునే భారతీయులు రవాణా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం.. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

అయితే.. మే 7 నుంచి దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments