Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే..?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (19:01 IST)
మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన తనకు కొన్ని సదుపాయాలు కల్పించాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా తనకు ఇంటి భోజనం కావాలని న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. 
 
అయితే కోర్టు మాత్రం మాజీ మంత్రికి షాక్ ఇచ్చింది. 'ముందు జైలు కూడు తినండి. ఒక వేళ తినలేకపోతే అప్పుడు చూద్దాం' అంటూ జడ్జి పేర్కొన్నారు . అయితే తన వయసు 71 ఏళ్లు కావడంతో జైలులో తనకు ప్రత్యేకమైన బెడ్ కావాలని కోరడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
 
ఈ నెల 1న మనీ ల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబై కార్యాలయంలో 12 గంటలపైనే ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments