Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎన్నికల ప్రక్రియ : ప్రశాంతంగా సాగుతున్న నాలుగో దశ పోలింగ్

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2015 (10:35 IST)
బీహార్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమై ప్రశాంతంగా సాగుతోంది. నాలుగో విడతలో భాగంగా 55 నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వీటిలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే మిత్ర పక్షాలు వీటిలోని 53 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించాయి. ఈ ఫలితాలను మళ్లీ పునరావృతం చేసేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోంది. 
 
ఈ దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో బరిలో ఉన్నవారిలో రాష్ట్ర సీనియర్‌ మంత్రి రామయ్‌ రామ్‌(బొచాహ), రంజు గీత (బాజ్‌పట్టి), మనోజ్‌ కుష్వాహ (కుద్ని) తదితర ప్రముఖులు ఉన్నారు. ముజఫర్‌పూర్‌, తూర్పు, పశ్చిమ చంపారన్‌, సీతామార్చి, షియోహార్‌, గోపాల్‌గంజ్‌, శివాన్‌ జిల్లాల పరిధుల్లో ఉన్న ఈ నియోజకవర్గాల్లో.. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైందని ఎన్నికల అదనపు ప్రధాన అధికారి (ఏసీఈవో) ఆర్‌ లక్షమణన్‌ తెలిపారు. 
 
కాగా, 43 స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ కొనసాగుతుందని, 8 స్థానాల్లో 4 గంటలకు, మరో 4 సెగ్మెంట్లలో 3 గంటలకు ఈ ప్రక్రియ ముగించనున్నట్లు వివరించారు. మొదటి మూడు విడతల మాదిరిగానే ఈసారి కూడా డేగకళ్ల నిఘాకు డ్రోన్లు, హెలీకాప్టర్లు ఉపయోగించనున్నామన్నారు. ఈ దశ పూర్తయితే మొత్తం 243 స్థానాల్లో 186కు ఎన్నికలు ముగిసినట్లే. ఈ నెల ఐదో తేదీన తుది పోరు అనంతరం ఎనిమిదిన ఫలితాలు ప్రకటిస్తారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments