Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో భారీ వర్షం, గాలుల బీభత్సం.. బిల్‌బోర్డ్ పడి 14మంది మృతి

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (12:47 IST)
billboard
ముంబైలో భారీ వర్షం కారణంగా 14మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షం, దుమ్ముధూళితో కూడిన తుఫాను కారణంగా భారీ బిల్‌బోర్డ్ పడిపోయిన ఘటనలో ఈ 14మంది మృతి చెందారు. అలాగే  దాదాపు 74 మంది గాయపడ్డారు. 
 
సోమవారం గంటపాటు కురిసిన తుపాను ధాటికి ఘట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లో ఎత్తైన బిల్‌బోర్డ్ కూలిపోయింది. ఇది కూలి పెట్రోలు పంపుపై పడింది. సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో సహాయకు చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి.
 
అలాగే వడాలాలో ఓ హోర్డింగ్ కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ హోర్డింగ్ చట్టవిరుద్ధమని వార్తలు వస్తున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గరిష్టంగా 40 చదరపు అడుగుల హోర్డింగ్‌ను అనుమతించగా, కూలిపోయిన బిల్‌బోర్డ్ 120 చదరపు అడుగుల పరిమాణంలో మూడు రెట్లు ఉన్నట్లు ముంబై మీడియా సంస్థలు తెలిపాయి. 
 
ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని, హోర్డింగ్‌లన్నింటినీ వెంటనే తొలగించాలని కోరుతూ స్థానిక వార్డు కార్యాలయం సదరు సంస్థకు 10 రోజుల సమయం ఇచ్చినట్లు ఓ ముంబై వార్తా సంస్థ వెల్లడించింది. ముంబై, థానేలలో అకాల వర్షాల కారణంగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ఇంకా ట్రాఫిక్‌ ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

Vijay: రష్మిక మందన్న బర్త్ డే వేడుకను ఓమన్ లో జరిపిన విజయ్ దేవరకొండ !

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments