Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం.. విద్యుదాఘాతానికి నలుగురి దుర్మణం

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (10:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. విద్యుదాఘాతానికి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదాకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సలాంబర్ జిల్లాలోని లసాదియా ప్రాంతంలో గురువారం రాత్రి విద్యుత్ షాక్‌కో ఒక కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హాటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, బోడ్ ఫల్లాలో నివాసం ఉండే ఉంకర్ మీనా ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, అది ఇంటి ఇనుపగేటును తాకిందన్నారు. ఈ కారణంగా 68 యేళ్ళ  ఉంకర్ మీనా, అతని భార్య భన్వారీ (65)కూడా విద్యుదాఘాతానికి గురయ్యారని, తల్లిదండ్రులను రక్షించేందుకు ప్రయత్నించిన అతని 25 యేళ్ల కుమారుడు దేవీలాల్, అతని 22 యేళ్ళ కుమార్తె  కూడా ఎలక్ట్రిక్ షాక్‌కు గురికావడంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనపై పొరుగింటివారు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోర్టుమార్టం నిర్వహించి ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments