Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. అపార్టుమెంటులో అగ్నిప్రమాదం - 14 మంది మృతి

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:30 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బహుళ అంతస్తు నివాస గృహంలో మంగళవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘోరం రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగింది. 
 
ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అపార్టుమెంటులో మంగళవారం రాత్రి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకున్నవారిలో నలుగురు చిన్నారులతో పాటు 14 మంది చనిపోయారు. ఈ బహుళ అంతస్తులో ప్రమాదం జరిగిన సమయంలో 400 మంది ఉన్నారు. 
 
మొత్తం 13 అంతస్తులు ఉండే ఈ భవనంలో తొలుత రెండో అంతస్తులో మంటలు చెలరేగి, క్రమంగా భవనం అన్ని అంతస్తులుకు వ్యాపించాయి. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలతో పాటు అగ్నిమాపకదళ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి రక్షించారు. అయినప్పటికీ 14 మంది సజీవదహనమయ్యారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments