Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో నలుగురి ప్రాణాలు తీసిన రైల్ ఫుట్‍బోర్డు ప్రయాణం...

'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయా

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:07 IST)
'ఫుట్‌బోర్డు ప్రయాణం.. ప్రమాదకరం' అని వాళ్లకు తెలుసు. అయినా కూడా.. ఉన్నది ఒక్కటే రైలు కావడంతో ఫుట్‌బోర్డుపైనే ఎక్కారు. రద్దీ ఎక్కువ అవడంతో ఫుట్‌బోర్డు మీదే దాదాపు పది నుంచి పదిహేను మంది వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఎలాగైనా త్వరితగతిన గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వారికి మార్గమధ్యలోనే మృత్యువు ఎదురైంది. గమ్యం చేరకుండానే వారి జీవితాలను కబలించి వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో మంగళవారం ఉదయం జరిగిన విషాద ఘటన ఇది.
 
ఈ దుర్ఘటన మంగళవారం ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చెన్నై బీచ్‌-తిరుమాల్‌పూర్‌ లోకల్‌ రైలులో జరిగింది. రైలు బాగా రద్దీగా ఉండటంతో కొంతమంది ప్రయాణికులు ఫుడ్ బోర్డుపై నిల్చుని ప్రయాణిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగానే కరెంట్ పోల్‌ను వారు ఢీకొట్టారు. దీంతో ఫుట్‌బోర్డులో ఉన్న ప్రయాణికులంతా కిందపడిపోయారు. ఇందులో నలుగురు అక్కడి కక్కడే చనిపోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments