Webdunia - Bharat's app for daily news and videos

Install App

Azam Khan పిలుపు: సైనికులు అత్యాచారాలకు పాల్పడితే వారి మర్మాంగాలను కోసివేయాలి

మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పిలుపు నిచ్చారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆజంఖాన్ ఈసారి సైనికులపై పడ్డారు. అత్యాచారాలకు

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (17:17 IST)
మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పిలుపు నిచ్చారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆజంఖాన్ ఈసారి సైనికులపై పడ్డారు. అత్యాచారాలకు పాల్పడే సైనికులపై ప్రతీకార చర్యలకు దిగాలన్నారు. అంతటితో ఆగకుండా వారి మర్మాంగాలను కోసివేయాలన్నారు. 
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దారుణాలు పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల తర్వాత భారతదేశం దారి తప్పిందని కామెంట్లు చేశారు. బ్యాలెట్ వదిలి, బుల్లెట్ విధానాన్ని ఎంచుకుందని చెప్పారు. జార్ఖండ్‌, అస్సోం, కాశ్మీర్ రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల లైంగిక వేధింపులు శృతి మించాయని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. 
 
అలాంటి సైనికులను వదిలిపెట్టకూడదని, చితకబాదాలని ఆజంఖాన్ మహిళలకు పిలుపునిచ్చారు. కాగా సైనికులపై ఘాటుగా విమర్శలు గుప్పించిన ఆజం ఖాన్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో చోటు దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో ఆజంఖాన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం