Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలక్ట్రిక్ బైక్ విసిగెత్తించింది. స్కూటర్‌ను పెట్రోల్ పోసి తగులబెట్టిన డాక్టర్

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (09:38 IST)
ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతి కావడం.. ఆటోమేటిక్‌గా వెనక్కి వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి అసహనం తారాస్థాయికి చేరుకుంది. దాంతో అతడు లక్షలు పోసి కొనుగోలు చేసిన తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తగులబెట్టాడు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ పృథ్వీరాజ్ మూడు నెలల క్రితం ఓలా ఎస్-1 ప్రో కొనుగోలు చేశాడు. అయితే కంపెనీ చెప్పినట్టుగా ఈ స్కూటర్ మైలేజ్ అందించడం లేదట. అలాగే దీని పనితీరు చాలా పేలవంగా ఉండటంతో పాటు తరచూ రిపేర్‌కి వస్తోందట. 
 
ఈ సమస్యను ఓలా కంపెనీ దృష్టికి తీసుకెళ్లినా అటువైపునుంచి కనీస స్పందన కూడా కరువయిందట. దీనితో ఈ రిపేర్ ఖర్చులను భరించలేక ఓనర్ తన స్కూటర్‌ను తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
సింగిల్ ఛార్జ్‌పై 181 కిలోమీటర్లు వస్తుందని కంపెనీ చెప్పినట్లుగా మైలేజ్ రావడం లేదని అతను వాపోయాడు. ఒకరోజు కేవలం 44 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత అతని స్కూటర్ ఆగిపోయిందట. 
 
180 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయొచ్చు అనుకున్న ఆ వ్యక్తికి దీంతో దిమ్మ తిరిగినంత పని అయిందట. ఈ కోపంతోనే అతను స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments