Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల రూపాయల నోటు కోసం రైలు పట్టాలపైకి దూకేసింది.. ఏమైందంటే?

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:43 IST)
రూ.2 వేల కోసం ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మెట్రో పట్టాలపైకి దూకేసింది. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకామోర్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన జకారిచ్ కోశాయ్ అనే మహిళ ద్వారకామోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమె వద్దనున్న రూ.2 వేల నోటు మెట్రో పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ నోటును తీసుకునేందుకు మహిళ పట్టాలపైకి దూకింది. 
 
అంతలోనే పట్టాలపైకి మెట్రో రైలు రావడంతో అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ట్రాక్ మధ్యలో ఉండిపోవడం వల్ల స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. కొన్ని బోగీలు ఆమెపై నుంచి వెళ్లాయి. ఆ తర్వాత జకారిచ్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు గానూ క్షమాపణలు కోరుతూ లేఖ రాయించుకున్నారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments