Webdunia - Bharat's app for daily news and videos

Install App

గడ్డి స్కామ్‌లో లాలూ ప్రసాద్‌ దోషి : సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు

దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (15:58 IST)
దేశాన్ని ఓ కుదుపు కుదిపిన పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఈ మేరకు రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. అలాగే, మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.  
 
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991–94 కాలంలో దియోగఢ్ ‌(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. 
 
దీంతో లాలూ సహా మొత్తం 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్‌ 27న చార్జిషీట్‌ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. మిగిలిన వారంతా శనివారం కోర్టుకు హాజరయ్యారు. 
 
ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం తీర్పునిచ్చింది. తీర్పు సందర్భంగా తన కుమారుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చిన లాలూ ప్రసాద్‌కు ఊరట లభించలేదు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష కాలాన్ని జనవరి మూడో తేదీన ఖరారు చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments