Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిబంధనలు అతిక్రమిస్తే... చేతికి పువ్వులు.. గాంధీగిరి... సరి-బేసి విధానంపై కేజ్రీవాల్

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (05:39 IST)
జనవరి ఒకటో తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు సరి-బేసి సంఖ్యల విధానాన్ని అమలుచేయనున్నారు. ముఖ్యంగా... నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కొంతమేరకు అయినా తగ్గించేంకు గాను ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేయనుంది. 
 
అయితే, సరి-బేసి సంఖ్య విధానాన్ని వాహనదారులు నిబంధనల్ని అతిక్రమిస్తే వారితో దురుసుగా మాట్లాడటానికి బదులుగా పువ్వులివ్వాలని ట్రాఫిక్ అధికారులకు, వాలంటీర్లకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈ పద్ధతి అమలు విషయంలో ట్రాఫిక్‌ పోలీసులకు ఆయన మార్గనిర్దేశం చేస్తూ కొన్ని హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేశారు. 
 
'వాహనచోదకుల పట్ల దురుసుగా ప్రవర్తించ వద్దు. ప్రజల మనస్సుల్ని మార్చేందుకు ప్రయత్నించండి. చేతిలో ఎర్రలైటు, ప్లకార్డు పట్టుకోండి. ట్రాఫిక్‌ నిబంధనల్ని అతిక్రమిస్తున్న వారిపై ఆ ఎర్రలైటు వెయ్యండి. వారికి పువ్వులివ్వండి. ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించండి. వారితో గొడవ పడటం, చలానాలు రాయడం ముఖ్యం కాదు' అంటూ చెప్పుకొచ్చారు. 
 
ఈ పద్ధతి అమల్లోకి వస్తే బేసి సంఖ్య గల తేదీల్లో బేసి నెంబర్‌ ప్లేట్‌ గల వాహనాలు, సరి సంఖ్య గల తేదీల్లో రిజిస్ట్రేషన్‌ నెంబరు గల వాహనాలు మాత్రమే ఢిల్లీలో తిరగడానికి అనుమతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ పద్ధతిని అవలంబిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments