Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపతుల మధ్య "ఆర్థిక సంక్షోభం"?

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (09:01 IST)
వారిద్దరూ అన్యోన్య దంపతులు. కానీ దేశ ఆర్థిక సంక్షోభం వారి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

‘‘దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. ఒకదాని తర్వాత మరో రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయినా దీన్ని అంగీకరించేందుకు మోదీ సర్కారు సిద్ధంగా లేదు’’.. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌! సోమవారం ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమై న ఆయన వ్యాసం సంచలనం సృష్టిస్తోంది.

ఇందులో ఆయన మోదీ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘నెహ్రూ ఆర్థిక విధానాలను రాజకీయ కోణంలో విమర్శించడం తప్ప బీజేపీకి సొంత విధానమంటూ లేదు. ఆర్థికవిధానాలకు సంబంధించి ‘ఇది కాదు, ఇది కాదు’ అనడమే తప్ప ఏది ఉండాలన్న స్పష్టతలేదని విమర్శించారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ల విధానాలే శరణ్యమని చెప్పారు.
 
మౌలిక సంస్కరణలు మావే: నిర్మల
తన భర్త రాసిన వ్యాసంలోని వాడి విమర్శలపై నిర్మలా సీతారామన్‌ సూటిగా స్పందించలేదు. అయితే, 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జీఎస్టీ, ఆధార్‌, వంట గ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది మోదీ సర్కారేనని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం