Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఇదొక భాగం: ఓ. పన్నీర్ సెల్వం

తమిళనాడు రాష్ట్ర శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధ్వజమెత్తారు. శాసనసభ వేదికగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కె.పళనిస

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (16:35 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభలో చోటుచేసుకున్న సంఘటనలు మన్నార్ గుడి మాఫియా చర్యల్లో ఒక భాగమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ధ్వజమెత్తారు. శాసనసభ వేదికగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాసనసభలో మాఫియా తిష్టవేసిందని అన్నారు. న్యాయం కోరితే దాడి చేశారని ఆరోపించారు. అమ్మ అశయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే సభ్యులు నడుచుకుంటున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు లేకుండా ఓటింగ్ జరపడం సరైన విధానం కాదని ఆయన చెప్పారు. అన్యాయంగా కొట్టి, తిట్టి బయటకు నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అసెంబ్లీ సాక్షిగా శశికళ వర్గం ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేసిందని పన్నీరు సెల్వం వర్గం మండిపడింది. శాసనసభ సాక్షిగా ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేశారని చెప్పారు. జయలలిత అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దీనిపై ప్రజాన్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జరిగిన దారుణాన్ని వివరిస్తామని వారు వెల్లడించారు. ఈ రోజు ఓడింది తాము కాదని, ధర్మం, న్యాయం ఓడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments