Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే భర్తలకు తిండిపెట్టండి.. లేకుంటే అది కట్?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (15:27 IST)
భారత్‌తో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నిక‌ల కోసం విచిత్ర రీతిలో ప్ర‌చారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన అనూహ్యమైన కామెంట్ చేశారు. మీ భర్తలు మీరు చెప్పినట్లు ఓటు వేస్తేనే, వారికి ప్రేమతో అన్నం పెట్టాలని, లేకుంటే ఆ రోజు వాళ్లకు అన్నం పెట్టవద్దంటూ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆడవాళ్లను ఉద్దేశించి అన్నారు. 
 
బుధవారం నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మ‌ధుబ‌నిలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో నితీశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఉదయం పూటనే ఓటు వేయాలని ఆయన మహిళలను అభ్యర్థించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు నితీశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 
 
ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. మద్యాన్ని నిషేధించారు. కన్యా వికాస్, ముఖ్యమంత్రి నాప్‌కిన్ యోజన లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇలా చేయడం ద్వారా ఎన్నికల్లో తనకు మహిళల అండ ఉంటుందని నితీశ్ ధీమాగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం