తప్పతాగి ఇంటికి వస్తే ఎలా? భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే..?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (13:38 IST)
యూపీలోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసి రాత్రంతా శవంతోనే నిద్రించింది. ఉదయం నిద్రలేచిన తర్వాత పిల్లలు అతన్ని లేపాలని ప్రయత్నించినా.. పిల్లలను లేపొద్దని వారించింది. ఆపై బ్యూటీపార్లర్ కు వెళ్లింది. 
 
వివరాల్లోకి వెళితే.. అతుల్, అన్నూ ఇద్దరు దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నూ ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేసేది. ఇంటికి వచ్చి కుటుంబాన్ని చూసుకునేది. ఇక అతుల్ పనిచేసినా ఆ కష్టమంతా మద్యానికే దారపోసేవాడు. ఇంట్లో తన భార్యతో ఘర్షణకు దిగేవాడు. డిసెంబర్ 15న అతుల్ మద్యం సేవించి అర్థరాత్రి వచ్చి అన్నును కొట్టాడు. 
 
భరించలేకపోయిన అన్నూ.. ఇంట్లోని ఓ కర్రతో అతుల్ తలపై కొట్టింది. దాంతో స్పృహ కోల్పోయాక.. అతని గొంతు నులిమి చంపేసింది. రాత్రంతా శవం వద్దే నిద్రపోయింది. తర్వాత మద్యం సేవించి కిందపడి చనిపోయాడంటూ సీన్ క్రియేట్ చేసింది. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అన్నూ నిజాన్ని అంగీకరించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments