Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైన్‌షాపుకు ఐదేళ్ల కుమారుడితో వెళ్లిన తండ్రి..

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (11:53 IST)
అవును.. మందేసేందుకు ఐదేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లాడు ఓ తండ్రి. అయితే ఫూటుగా తాగేసిన ఆ దుర్మార్గుడు కన్నబిడ్డను మరిచిపోయాడు. తాగి రోడ్డుపైనే పడిపోయాడు. చివరికి ఆ బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చెన్నైకి సమీపంలోని ఓరగడంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా, ఓరగడం సమీపంలోని సేందమంగళం ప్రాంతానికి చెందిన కుమార ప్రసాద్ తన ఐదేళ్ల కుమారుడితో టాస్క్ మార్క్ షాపుకు వెళ్లాడు. ఐదేళ్ల కుమారుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. మద్యం తాగాడు. ఫుల్‌గా తాగడంతో తలతిరిగి రోడ్డుపై పడ్డాడు. చివరికి కుమారప్రసాద్ ఐదేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. 
 
ఇంతలో కుమార ప్రసాద్‌ని వెతుక్కుంటూ ఆతడి భార్య రోడ్డుపైకి వచ్చింది. కానీ భర్త రోడ్డుపై పడివుండటాన్ని గమనించింది. ఇంకా పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని బోరున విలపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments